Telugu Revolutionist : ప్రతివాది భయంకర వెంకటాచారి

నచ్చిన విప్లవకారుడు

 

ప్రతివాది భయంకర వెంకటాచారి

భరతావని అంతా స్వాతంత్ర సమర జ్వాలలు ఉప్పెనలా ఎగసిపడుచున్న కాలమది. చిన్నా,పెద్దా, స్త్రీ ,పురుష భేదం లేకుండా ముందుకు అడగు వెయ్యడమే కాని ఏ ఒక్కరూ వెనుకడుగు వెయ్యట్లేదు.

గాంధీగారి అడుగు జాడలలో నడుస్తూ సత్యాగ్రహాలు, నిరహార దీక్షలతో కొంత మంది హోరెత్తిస్తూంటే, అది నచ్చని బోస్‌, భగత్ సింగ్‌ ల ప్రభావంతో బందూక్లూ, తుపాకులు పేలుస్తూ , బాంబు దాడులతో భయస్ఫోటాలు కలిగిస్తూ రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్య పునాదులు కదిలేటట్లు , వైశాఖ మాసపు సుడి,వడ గాలుల వలె మధ్యాహ్నమార్తాండుల వలె విజృంభిస్తూ ఐరోపా ఖండం
వరకూ ఆ బడబాగ్నులను ప్రజ్వరిల్లజేస్తున్నారు.

ఆ సమయంలో బ్రిటీష్‌ పాలనను సాయుధంగా ఎదురు కొనదలచిన తెలుగు జాతి పౌరుషం, తెలుగుబిడ్డ, మన విప్లవ సింహం
ఆత్మగౌరవ రణభేరి-ప్రతివాదిభయంకర వేంకటచారి.జననం-28.08.1910.

తెల్లవారి గుండెల్లో బాంబులు పేల్చిన ఘనుడు మనోడు.పంతొమ్మిది ఏటనే ఉప్పుకటారులపై దాడి చేసిన వీరకిశోరం.సామర్లకోట నుండి ఉద్భవించినవాడు.బాంబులు పేల్చి బ్రిటీష్‌ వారిని పారద్రోలలాలని తలచి ఆచరణలో పెట్టి సుధీర్ఘకాలం జైలుశిక్ష అనుభవించిన విప్లవకారుడు.

కుటుంబ యోగక్షేమాలు త్యాగం చేసి తీవ్రంవాదం ద్వారా బ్రిటీష్‌ పాలకులను బెంబేలు పుట్టించిన ప్రతివాద ” భయంకర” వెంకటాచారి (Telugu Revolutionist ).వేదాంతం సదానందం తో కలిసి ‘ హిందుస్థాన్‌ సేవాదళ్‌ లో ట్రైనింగ్‌ పొందారు.

చరితార్థలైనప్పటికీ చరిత్రలో పదివాక్యాలకు కూడా నోచుకోని చరిత్ర పురుషులు భరతావని నిండా ఎందరో ఉన్నారు.ప్రతివాది భయంకర వెంకటాచారి లేదా భయంకరాచారి అలాంటి చరిత్రపురుషుడు.సాహసి,త్యాగమూర్తి,రచయిత,గొప్ప వక్త. సంస్కృత పండితుల కుటుంబంలో పుట్టారాయన.అయినా ఆంగ్ల చదువులు చదివారు.

సొంతూళ్ళో పదవ తరగతి చదివి విశాఖపట్టణం ఏవిఎన్‌ కాలేజీలో ఇంటర్మీడియెట్ లో చేరారు.అప్పుడే ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థీ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.దేశోద్దారక కాశీనాథుని నాగేశ్వరావు గారి ప్రోద్భలంతో జాతీయోద్యమము లోకివచ్చారు.

1928 కాలంలో ఆయన కాశీనాథుని గారిని కలుసుకున్నారు.వారు ఆంధ్రపత్రిక యజమాని.వారిని ఆ రోజులలో కవులు కలుసుకుని తమ రచనలను ప్రచురించమని కోరేవారు.మన భయంకరచారి గారు కూడా ఆయన రచించిన ” ప్రమద్వర పరిణయం’ గ్రంథం అచ్చు వేయమని కోరేవారు.

ఆ రోజుల్లో మద్రాస్‌ప్రెసిడెన్సీకి ప్రధాన అనువాదకుడిగా మరియు పరీక్షల నిర్వహణాధికారిగా ఉండేవారు.పుస్తకంలో అభ్యంతరకరమైన అంశాలు లేవని , పుస్తకం బ్రిటీష్‌ ప్రభుత్వమునకు వ్యతిరేకము కాదని భానుమూర్తి ఆమోద ముద్ర వేసెవారు.

ఆ పత్రం తెచ్చాక పుస్తకం ప్రచురణ అయ్యేది.నిజానికి పుస్తక ప్రచురణ కంటే భయంకరాచారి వ్యక్తిత్వం మీదే కాశీనాథుని ఎక్కువ ఆసక్తి చూపారు.ఆ తరువాతే భయంకరాచారి జాతీయోద్యమంలో ప్రవేశించారు.

గాంధీమార్గం నుంచి బాంబుల వైపు : 

1929 ( డిశంబర్‌) నాటి లాహోర్‌ జాతీయ సభలకు కాశీనాథుని తో పాటు భయంకరాచారి (Telugu Revolutionist )వెళ్ళారు.అప్పటికి ఆయన వయస్సు 19 ఏళ్ళు.అక్కడే పూర్ణ స్వరాజ్యం గురించి నేతలు ప్రకటించారు.అక్కడే ఆయన గాంధీని కలుసుకున్నారు.

ఆ పిదప కాకినాడలో బులుసు సాంబమూర్తి నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు .1930 మే నెలలో గురజనపల్లిలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం పాలుగొని జైలుకు వెళ్ళారు.

బళ్ళారి జైలులో ఉండగానే బెంగాల్‌ విప్లవకారులతో పరిచయాలయ్యాయి.వారంతా లాహోర్‌ కుట్ర కేసులో ఉన్నవారే.” యవతను ఉరితీస్తూ ,ప్రవాస శిక్షలు విధిస్తూ ఉంటే జాతి కళ్ళు మూసుకుని కూర్చోలేదు.ఎదురుతిరిగి విప్లవించాలి.అందుకు అవసరమైన ఖర్చులకోసం బ్యాంకులు దోచాలి.” అన్నది ఆయన సిద్దాంతం.

ఉప్పు సత్యాగ్రహంలో నాటి తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్‌ బులుసు సాంబమూర్తి తల పగలగొట్టాడు.భయంకరాచారికి గూడా గట్టిదెబ్బలే తగిలాయి.ఆ సందర్భంగా జైలుకు వెళ్ళినప్పుడు ఆయన అతివాద తీవ్ర జాతీయోద్యమం వైపు మొగ్గు చూపారు.గాంధీజీ అహింసా ఉద్యమానికి ఆయన వీడ్కొలు పలికారు. ఆ తరువాత జరిగిందే కాకినాడ బాంబు కుట్ర కేసు.

కాకినాడ బాంబు కుట్రకేసు :

జలియన్‌వాలాబాగ్‌ లో కాల్పుల ఘటన భరతావని నిండా యువతంతా ఒక్కసారి భగ్గుమంది.ఎక్కడికక్కడే అనేక విప్లవ సంఘాలు, పార్టీలు ఏర్పాడ్డాయి.వాళ్ళ ధ్యేయము చంపడమో, చావడమో.ఇటువంటి సంఘాలు ఎక్కువగా బెంగాల్‌, పంజాబ్‌ లో ఏర్పడ్డాయి.ఆ సమయంలోనే పంజాబ్‌ కేసరి లాలాలజపత్‌రాయ్‌ ను తీవ్రంగా కొట్టడం జరిగింది.

అది జరిగిన కొన్ని రోజులకే ఆయన మరణించారు.ఈ చర్యలకు ప్రతీకారం తీర్చుకోవడమే భరతజాతి ఆత్మగౌరవమని నమ్మారు.ఆ యువకులకు అప్పటి వరకూ ఎటువంటి నేరమూ చేసిన వారు కారు.వారి స్వభావం కూడా అతి కోమలమైనది.అలాంటి తీవ్ర నిర్ణయానికి రావడానికి ముందు వారికీ ఒక ఉద్యమ నేపథ్యం ఉందనీ మనము మరవకూడదూ.అలాంటి నిర్ణయానికి ఆయనను తీసుకువచ్చిన పరిణామాలు వేరు.

బ్రిటీష్‌ ఇండియా పోలీసు జులుంకు పెద్దాపురం ఘటన( డిశంబర్‌16, 1930) గొప్ప ఉదాహరణ.ధనుర్మాస సంతర్ఫణ కోసం దాదాపు ఎనభై మంది పెద్దలు , పిన్నలు బొక్కా నారాయణ మూర్తి అనే రైతు తోటకు వచ్చారు.వత్సవాయి జగపతి వర్మ(జమీందారు) , క్రొవ్విడి లింగరాజు,దువ్వూరి సుబ్బమ్మ, పెద్దాడ నారాయణ వంటి ప్రముఖులూ పాల్గొన్నారు.ఉద్యమం గురించి చర్చించాలనుకున్నారు.సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ డప్పుల సుబ్బారావు హెచ్చరికలు ఇచ్చినా, సమయం ఇవ్వకుండా లాఠీ చార్జి చేశారు.

వాడపల్లి రథయాత్రలో కాల్పులు(మార్చి30,1931) జరిగాయి.నలుగురు చనిపోయారు.సీతానగరం గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని (19.01.1932) పోలీసులు ధ్వంసంచేశారు.ఒక సందర్భంలో భయంకరాచారి (Telugu Revolutionist ) యూనియన్‌ జాక్‌ను తగులబెట్టారు. అప్పుడు జరిగిన లాఠీచార్జ్‌ లో గాయపడిన భయంకరాచారి ఎనిమిది గంటలపాటు స్పృహ కోల్పోయారు.ఆ పై కొన్ని రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు.వీటన్నింటికీ మూలకారకులు పోలీస్‌ సూపరింటెండెంట్‌ ముస్తఫా ఆలీఖాన్‌,సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ డప్పుల సుబ్బారావు.

ఆ ఇద్దర్ ఆకృత్యాలకు హద్దేలేకుండా పోయింది ఆ రోజులలో.జాతీయ కాంగ్రెస్‌ నాయకుల మీద, స్వరాజ్య సమరయోధుల మీద ఈ ఇద్దరూ కక్ష గట్టారు.మనవారు కూడా కొంతమంది ఎంగిలి కూటికి ఆశపడి ఉచ్ఛనీచాలు లేకుండా ప్రవర్తించేవారు.అందుకే ముస్తాఫా ను చంపాలని భయంకరాచారి పథకరచన చేశారు.

మరొక ఎనిమిది మందితో కలిసి ముస్తాఫాను కడతేర్చలని పథకరచన చేశారు.కాకరాల కామేశ్వరరావు, బోయిన సుందరం, చల్లా అప్పారావు, వడ్లమాని శ్రీరామమూర్తి, చిలకమర్రి సత్యనారాయణా చార్యులు, నండూరి నరసింహాచార్యులు.ఈ బృందం లో సభ్యులు.ప్రధాన పాత్ర మాత్రం భయంకరా చారి,కామేశ్వరరావు,వడ్లమాని శ్రీరామ మూర్తి లదే.కలకత్తా, పుదుచ్ఛేరి, బొంబాయి ల నుంచి బాంబుల తయారీకి కావలసిన పదార్థాలు సేకరించారు.

బాంబులతో బ్రిటీష్‌ వారి పునాదులు కదిపి భయకంపితులను చెయ్యగలం అనే  నమ్మకం భయంకరాచారి కి ఉంది. కానీ ఈ ప్రయత్నం సజావుగా సాగడానికి కాకినాడ లోని జగన్నాధపురం లో “సీహెచ్‌ఎన్‌చారి అండ్‌ సన్స్‌ “అనే పేరుతో ఒక దొంగ కంపెనీ ప్రారంభించారు.

మొదట ముస్తఫా నివాసం కదలికలు గురించి కష్టపడి కనుక్కున్నారు.కాకినాడ లోని ఉప్పుటేరు సమీపంలో ఉంటున్నాడతను.అక్కడే బ్రిటీష్‌ సంస్థ రిప్లయి కంపెనీ ప్రాంగణంలో నివాసం.అతడి నివాసం ఎదురుగానే బొమ్మల జెట్టి దగ్గర భారీ నావలు ఉంటాయి.ఇవన్నీ స్ట్రాస్‌ అండ్ కంపెనీ కి చెందినవి.ఉప్పుటేరుకు అవతల గట్టున నున్న జగన్నాథపురానికి జాలీ బోట్ల ( చిన్నవి) లో వెళతాడని తెలిసింది.అందుకే ఆ పడవలోనే బాంబు పెట్టాలని నిశ్చయించారు.

ప్రణాళిక  1933 ఏప్రిల్‌ మొదటి వారంలో అమలు చేయడం ప్రారంభించారు.తొలిగా 6న, తరువాత 14న, బాంబులు పెట్టారు.ఆ రెండు రోజులు కూడా అతను రాలేదు.15 వ తేది వేకవజామున మళ్ళీ బాంబు పెట్టారు.ఈ సారి కూడా ముస్తాఫా జాడలేదు.ఆ రోజు బాంబులన్నీ సంచీ లో పెట్టి ఒక పడవలో దాచి సమీపంలో నే ఉన్న హోటల్‌ కు   వెళ్ళారు.

ఇంతలో బాంబుల మ్రోత.16 వ నంబరు బోటులో దాచిన బాంబుల సంచిని సరంగు తీయడంతో పేలాయి.తొమ్మిది మంది కూలీలు గాయపడ్డారు.పేలుడు శబ్దానికి అక్కడికి చేరుకున్న వారిలో సాక్షాత్తు ముస్తాఫా కూడా ఉన్నాడు.
అక్కడ పేలకుండా మిగిలిన మూడు బాంబులు దొరికాయి.ఐదు రోజుల తరువాత గాని అది విప్లవకారుల కుట్రయని, తనని అంత మొందించేందుకు జరిగిన పన్నాగమని అతడికి తెలియలేదు.

కాకినాడ కి చెందిన ఒకరు ఎస్‌.ఐ కి విషయం చెప్పడం తో కుట్ర బయటపడింది.ఒక్కొక్కరినీ పట్టుకోవడం ప్రారంభించారు. అప్పటికి తప్పించుకున్నా , భయంకరా చారి ని సెప్టెంబర్‌ 11 న ఖాజీపేట రైల్వేస్టేషన్‌ లో పట్టుకున్నారు.అండమాన్‌ కు తూర్ప గోదావరి జిల్లా సెషన్స్‌ కోర్ట్‌ కేసు విచారించి అందరికీ శిక్ష విధించింది.

దీని మీద అప్పీలుకు వెళ్ళారు.మద్రాసు కు చెందిన ప్రముఖ న్యాయవ్యాది వీ.ఎల్‌.యతి రాజు కేసు వాదించారు.కామేశ్వరరావుకు, వడ్లమాని శ్రీరామమూర్తి లకు నాలుగేళ్ళు కఠిన జైలు శిక్ష విధించారు.ఆ శిక్షలు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో అమలు పరిచారు.

భయంకరా చారి ఏడేళ్ళు ద్వీపాంతర వాస శిక్ష విధించి అండమాన్‌ జైలుకు పంపించారు.భయంకరాచారి నరకం చూశారు. ఈ కారాగారాన్ని ‘ ప్యారడైజ్‌’ అని మద్రాస్‌ ప్రెసిడెన్సీ హోం మెంబర్‌ హెన్రీ క్రేక్‌ వ్యంగంగా అంటూ ఉండేవాడు.1937 లో జాతీయ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వచ్చిన తరువాత
భయంకరా చారి విడుదల అయ్యారు.ఆపై ఆయన తన జైలు అనుభవాలను అక్షర  రూపం ఇచ్చారు.

దీనికి ఆయన పెట్టిన పేరు ‘ క్రేక్స్‌ ప్యారడైజ్‌, లైఫ్‌ ఇన్‌ అండమాన్స్‌’.సండే టైమ్స్‌ సంపాదకులు కామత్‌ ప్రచురించారు.చక్రవర్తుల రాజగోపాలా చారి ముందు మాట వ్రాశారు.అండమాన్స్‌ లో శిక్ష అనుభవించిన ఎందరో తీవ్ర జాతీయవాదుల ప్రస్తావనలు ఇందులో ఉన్నాయి.

భయంకరా చారికి (Telugu Revolutionist ) అప్పటికింకా పెళ్ళి కాలేదు.అనేక కష్టాలు పడుతున్నారు.అలాంటి సమయంలో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రముఖుడు అనంతశయనం అయ్యంగార్‌ భయంకరాచారిని నెహ్రూకు పరిచయం చేశారు.వెంటనే నెహ్రూ ఆయన ఆశయాల మేరకు పనిచేయడానికి అనుమతినిస్తూ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌గా నియమించారు.తరువాత పెళ్ళి చేసుకుని ప్రశాంత జీవనం సాగించారు. అయితే ఒక దశలో ప్రభుత్వాన్ని విమర్శించి నందుకు ఉద్యోగం నుంచి తీసివేశారు.మళ్ళీ నెహ్రూయే కలగజేసుకుని మళ్ళీ బాధ్యతలు ఇప్పించారు.

పాత్ర ముగిసినా రంగస్థలం మీదే ఉండిపోయిన పాత్ర యని పి.రాజేశ్వరరావు,తన ‘ ది గ్రేట్‌ ఇండియన్‌ పేట్‌రియాట్స్‌’ లో భయంకరా చారి (Telugu Revolutionist ) గురించి వ్యాఖ్యనించారు.1975 భార్య కన్ను మూసింది.తరువాత వీరి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది.భయంకరా చారి తుదకంటూ జాతీయవాది గానే ఉన్నారు.ప్రకాశం పంతులు గారితో సన్నిహితంగా ఉండే వారు.దేశం కోసం త్యాగం చేయడం జీవితాన్ని వృధా చేయడం కాదు.అన్న సావర్కార్‌
వ్యాఖ్యకు నిలువెత్తు రూపం ప్రతివాది భయంకర వేంకట చారి .అండమాన్‌ లో కూడా ఆయనకు తోటి ఖైదీ వినాయక్‌ దామోదర్‌ సావర్కార్‌

 

Also Read :  తెలుగు జానపద గేయం- వివరణ

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!