Moral Stories For Children : నీతి కథ – బహుమతి
చిన్న పిల్లల నీతి కథలు
బహుమతి
రంగాపురం అనే గ్రామంలో రాణి, వాణి రాజి అనే ముగ్గురు స్నేహితులు(Moral Stories For Children ) ఉండేవారు. ముగ్గురూ ఒకే తరగతిలో చదివే వారు .ఒక రోజు
సామాన్య శాస్త్ర ఉపాధ్యాయులు పాఠం చెప్పడం అయిన తర్వాత ఏదో సందర్భంగా ఒక నీతి వాక్యం చెప్పాడు . అది ఏమిటి అంటే “ఎంత కష్టములో ఉన్నా అబద్దం చెప్పకూడదు,నిజమే చెప్పాలి “అని అన్నాడు. పిల్లందరూ “అలాగే సార్” అని ఒక్క సారిగా అరిచారు . తర్వాత విరామ సమయానికి గంట మ్రోగడంతో అందరూ బయటికి పరుగులు తీశారు.
స్నేహితురాళ్ళు ముగ్గురు కలసి కొన్ని తినుబండారాలను కొనుక్కొని తిన్నారు. తర్వాత పాఠశాల మైదానంలో కొద్ది పాటి సమయంలోనే
బాగా గంతులు వేస్తూ మైదానమంతా తిరిగారు. ఆసమయంలో రాణి జుంకి పడి పోయింది .అది గమనించిన రాజీ ఆ జుంకీ మెల్లగా తీసుకుంది.
మిగిలిన ఇద్దరు అది గమనించలేదు. జుంకీ పడిపోయిన విషయం రాణీకి వాణి చెప్పింది అంతా వెతికారు కనిపించలేదు. రాణీ బోరుమని ఏడ్చుకుంటూ పోయి తరగతి ఉపాధ్యాయునితో చెప్పిందీ.
ఉపాధ్యాయుడు కొద్ది సేపు ఆలోచించి “పిల్లలూ (Moral Stories For Children ) అమ్మాయి రాణిది జుంకి పోయింది., ఎవరికైనా దొరికివుంటే రాణికి ఇచ్చేయండి “
అని అందరినీ పేరు పేరున అడిగాడు. అందరూ మేము తీసుకోలేదని సమాధానం ఇచ్చారు.
“అయితే మీకందరికి ఒక విషయం చెబుతున్నా,అది ఏమిటంటే ఎవరైతే నిజం చెప్పి జుంకీ ఇస్తారో వాళ్ళకు నేను ఓ మంచి బహుమతి ఇస్తానని సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చి, బహుమతి మీద అశతో “సార్ నాకు దొరికింది నేను నిజమే చెప్తున్నా”అని చెప్పి ఉపాధ్యాయునికి అందజేసింది రాజీ.
“చూశారా పిల్లలూ రాజీ ఎంత మంచి అమ్మాయో.నిజం చెప్పింది మరియు రాణీ జుంకీ తెచ్చి ఇచ్చిందీ. అందరూ ఒక్క సారి చప్పట్లు కొట్టండి “అని అన్నాడు ఉపాధ్యాయుడు. పిల్లలందరూ (Moral Stories For Children ) చప్ఫట్లు కొట్టారు,రాణికి జుంకీ ఇచ్చాడు. రాజీకి బహుమతి ఇచ్చాడు.
” ఇప్పుడు చూడండి రాణి నవ్వుతోంది. చూశారా పిల్లలూ ప్రతీ ఒక్కరూ నిజం చెప్పాలి, నిజం చెబితే బహుమతులు కూడ వస్తాయి.”అన్నాడు ఆ ఉపాధ్యాయుడు. ముగ్గురు స్నేహితురాళ్ళు సంతోషించారు.
Also Read : నచ్చిన విప్లవకారుడు – ప్రతివాది భయంకర వెంకటాచారి